TG | స‌న్నవ‌డ్ల‌ బోన‌స్ కు స‌న్నాయి నొక్కులేనా : హ‌రీశ్ రావు

యాసంగి కోనుగోళ్ల‌తో రూ 1161 కోట్ల బ‌కాయిలు
త‌క్ష‌ణం రైతుల‌కు చెల్లించాలంటూ హ‌రీశ్ రావు డిమాండ్

హైద‌రాబాద్ : సన్న వడ్ల బోనస్ (fine paddy ) కూడా బోగస్ (bogus) అయింద‌ని మండిప‌డ్డారు బిఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) . అన్ని ప‌థ‌కాల‌లో ఎగ‌వేత‌ల‌లాగానే ఈ సన్న వడ్ల బోనస్‌పైనా సన్నాయి నొక్కులేనా అని రేవంత్ రెడ్డిని (revantha reddy ) ప్ర‌శ్నించారు (questioning ) . ఈ మేర‌కు ఆయ‌న నేడు ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ. 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గం అని మండిప‌డ్డారు.


4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేద‌న్నారు. . రాష్ట్రంలో పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంద‌ని, . స‌న్ ఫ్ల‌వ‌ర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. . ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేద‌ని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్‌ఫ్ల‌వర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికిన మంత్రి గారు. రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయమ‌ని అన్నారు. రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింద‌న్నారు..

Leave a Reply