హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం(kaleswaram ) వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ (Cabinet ) ఆమోదం లేకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి CM Revanth reddy ) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్ లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఆమోదం తీసుకుంటారని.. తాను బీజేపీ ఎంపీగా (BJP MP) కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నానని ఎంపీ ఈటల స్పష్టం చేశారు.
అప్పటి మంత్రులు మీ పక్కనే ఉన్నారు.. అడిగి తెలుసుకోండి
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు మీ పక్కనే ముగ్గురు ఉన్నారని, వారిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చారు. ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారని అన్నారు.