హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచన
17కి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతిపై జాప్యం చేస్తుడంటంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 17కి వాయిదా వేసింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 27న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
అయితే 17 లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21 కి వాయిదా వేసింది. అలాగే వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈనెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీని ఓరాస ప్రతివాదులుగా చేర్చింది.
ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ నెల 21 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.