Tamilanadu | గ‌వ‌ర్న‌ర్, రాష్ట్ర‌ప‌తి ప్ర‌మేయం లేకుండా 10 బిల్లుల ఆమోదం

దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి
త‌మిళ‌నాడు వేదిక‌గా ఘ‌ట‌న‌
సుప్రీం కోర్టు తీర్పుతో 10 బిల్లుల‌ను నోటిఫై చేసిన ప్ర‌భుత్వం

చెన్నై – దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందాయి. తమిళనాడుకు చెందిన పెండింగ్ బిల్లులు ఆమోదించినట్లుగా ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమెదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఉంచుకున్నారని.. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెనక్కి పంపిన బిల్లులను తిరిగి పంపితే.. రెండోసారి ఆమోదించి పంపినా ఆమోదం తెల్పలేదని పేర్కొంది. దీంతో సుప్రీం ధర్మాసనం ఆ బిల్లులు ఆమోదించినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా గవర్నర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. బిల్లులు ఆమోదించకుండా ఎందుకు తొక్కిపెట్టారని నిలదీసింది. ఈ బిల్లులు ఆమోదం పొందిన‌ట్లేన‌ని తీర్పు ఇచ్చింది.. ఈ నేప‌థ్యంలోనే ఈ 10 బిల్లుల‌ను స్టాలిన్ ప్ర‌భుత్వం నోటిఫై చేస్తూ గెజిట్ విడుద‌ల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *