అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం (Flight Accident) తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే విమానంలోని 11A సీట్లో ఉన్న విశ్వాస్ కుమార్ (బిశ్వాస్ర కుమార్మే) ష్ (40) అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) నుంచి అతడు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. .
విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ ఏకైక బ్రిటీష్ పౌరుడు (british Citizen) రమేష్ భయంకరమైన క్షణాల గురించి వివరించాడు. ‘టేకాఫ్ (Take off)అయిన 30సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని.. ఆపై విమానం కూలిపోవడం చాలా వేగంగా జరిగిందని తెలిపాడు. మృతదేహాల మధ్య లేచి అంబులెన్స్లోకి చేరుకున్నాన్నట్లు పేర్కొన్నాడు. అతని సోదరుడు మాత్రం ఈ ప్రమాదంలో మరణించాడు.