ఉట్నూర్, మే 1 (ఆంధ్రప్రభ) : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సన్ సైన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన మూగల అశ్విత (575), రాథోడ్ వంశిక (571)లు అత్యుత్తమ మార్కులతో డివిజన్ టాపర్లుగా రావడంతో గురువారం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్ తన కార్యాలయంలో ఉత్తమ విద్యార్థినీలకు శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పై చదువులో కూడా ఇలాగే రాణించి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఆయన కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.