అలరించిన మాక్ పార్లమెంట్

అలరించిన మాక్ పార్లమెంట్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని చౌటు పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరిని ఆకట్టుకుంది.ఇందులో విద్యార్థులు అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలుగా విడిపోయి దేశ సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంఈవో ఆంధ్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాక్ పార్లమెంట్ లో పరిస్థితి, పరిష్కరించాల్సిన సమస్యలు, పరిష్కారం కోసం వ్యూహాలను చర్చించారు.

సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఇటువంటి కార్యకలాపాలు విద్యార్థులు తమ ఆలోచనా ప్రక్రియలను స్పష్టంగా చెప్పడానికి, ఏదైనా బహిరంగ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వారిని ప్రేరేపించడానికి వీలు కల్పిస్తాయన్నారు. ప్రయోజనాలు ఏమిటంటే, విద్యార్థులలో సమగ్రంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, ఇది వారి వక్తృత్వ నైపుణ్యాలను ప్రదర్శిస్తుందని, పార్లమెంట్, పాలన గురించి విచారించడానికి, ప్రతిబింబించడానికి వారి కీలకమైన సామర్థ్యాన్ని చిత్రీకరించిందన్నారు.

విద్యార్థులతో మాక్ పార్లమెంట్ సన్నివేశాలను కన్నులకు కట్టినట్టుగా చూపించిన సోషల్ ఉపాధ్యాయులు రమేష్, శ్రీలత లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply