ముంబై : దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావం మన సూచీలపై కనిపించింది. సెన్సెక్స్ 300పాయింట్ల లాభంతో, నిఫ్టీ 24,432 మార్క్ ఎగువన ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంతో 80,799 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగబాకి 24,434 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్ ఎం షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
కొటక్ మహీంద్రా, ఓఎన్సీసీ, ఎస్బీఐ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, లార్సెన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎటువంటి వార్తలూ లేకపోవడంతో ప్రామాణిక సూచీలు ఈ వారం స్థిరీకరణ దశలోకి వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయి వరకూ వెళతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో… మార్కెట్లు ఒక శ్రేణికి పరిమితం కావొచ్చని వెల్లడించారు.