- శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహణా అధికారి ప్రత్యేక ఆదేశాలు జారీ
నంద్యాల బ్యూరో : శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాసరావు (ఆదివారం) ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే భక్తులు… స్వామివారి దర్శనం కోసం లేదా వసతి సౌకర్యాలు, ఆర్జిత సేవలు, శీఘ్ర దర్శనం, స్వామివారి స్పర్శ దర్శన టిక్కెట్ల కోసం అధికారిక వెబ్సైట్, ఆలయ వెబ్సైట్ లేదా దేవాదాయ శాఖ వెబ్సైట్ను సంప్రదించి ఆన్లైన్లో టిక్కెట్లు పొందాలని సూచించారు.
నకిలీ వెబ్సైట్ల జోలికి వెళ్ళవద్దని సూచించారు. వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ రకాల భక్తుల కోసం దేవస్థానం వెబ్సైటు, దేవాదాయ శాఖ వెబ్సైట్ కాకుండా నకిలీ వెబ్సైట్లో ను నమ్మి మోసపోవద్దు అని భక్తులను కోరారు.
ఎవరికైనా వెబ్సైట్ గురించి సమాచారం కావాలంటే దేవస్థాన సమాచార కార్యాలయం ఫోన్ నెంబర్ 8333901351, 8333901352, 833901353 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. సదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా నష్టపోకుండా ఈ సమాచారాన్ని భక్తులందరికీ చేరవేయాలని ఆయన కోరారు.