srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News

srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News

  • ఇద్దరు కొడుకులు సహా ఆత్మహత్యకు యత్నం
  • తల్లి మృతి.. బిడ్డలిద్దరూ వికలాంగులు
  • శ్రీకాకుళం జిల్లాలో విషాదం

( జలుమూరు(పోలాకి), ఆంధ్రప్రభ ):

srikakulam Mother Suicide : కుటుంబ కలహాల కారణంగా ఒక తల్లి, తన ఇద్దరు కుమారులతో సహా రైలు కింద పడి ఆత్మహత్య ప్రయత్నించింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా ఇద్దరు కుమారులు గాయాలతో శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే , శ్రీకాకుళం పట్టణానికి చెందిన కొత్తపల్లి జ్యోతి (35) ఓ వివాహిత. ఆమెకు ఇద్దరు కుమారు ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్​ ఏడవ తరగతి చదువుతున్నాడు. రెండవ కుమారుడు పునీత్​ రెండవ తరగతి చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన కుమారులతో కలిసి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తిలారు – ఉర్లాం రైల్వే స్టేషన్ మధ్య కంబకాయ రైల్గట్ దగ్గరలో (బొంతలకోడూరు) రైల్వే పట్టాలకు చేరుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు రైలు కింద పడకుండా తప్పించుకున్నారు. కానీ ఇద్దరిలో ఓ బాలుడి ఎడమ కాలు, ఇంకో బాలుడి కుడికాలు పాదం వద్ద తెగిపోయాయి. వెంటనే విశాఖ ఎక్స్​ ప్రెస్​ డ్రైవర్ రైలు ఆపి ఇద్దరు పిల్లల్ని శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కి తరలించారు. గాయపడిన ఇద్దరు పిల్లన్ని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చినట్లు జీఆర్బీ పోలీసులు తెలిపారు. .రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply