SPB | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

SPB | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
SPB | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు సంగీత ప్రపంచానికి చిరస్మరణీయుడైన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతిని శాశ్వతంగా నిలిపేలా రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహావిష్కరణ (Statue unveiling) ఘనంగా జరిగింది. ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కళాభిమానులను ఆకట్టుకోగా, సంగీతానికి అంకితమైన ప్రత్యేక కార్యక్రమాలతో రవీంద్రభారతి కళకళలాడింది.

ఈకార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) , హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7.6 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తయారుచేయించారు. ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
