- ప్రపంచ నంబర్-1 జోడీపై విజయం..
- ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా భారత ద్వయం
భారత టాప్ డబుల్స్ జోడీ సత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ 2025 సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో (శుక్రవారం) అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ప్రపంచ నంబర్ 1 మలేషియన్ ద్వయం గోహ్ స్జే ఫీ – నూర్ ఇజ్జుద్దీన్ పై ఆధిపత్యం చెలాయించిన భారత జోడీ వరుస సెట్లలో గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. కేవలం 39 నిమిషాల్లో 21-17, 21-15 స్కోర్లతో ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
ఈ సీజన్లో మూడో సెమీఫైనల్ ఎంట్రీ
ఈ విజయంతో, సాత్విక్-చిరాగ్ ఈ సీజన్లో మూడోసారి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. గతంలో వారు మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నమెంట్లలో సెమీఫైనల్ దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
హెడ్-టు-హెడ్ రికార్డులో ఆధిక్యం
ఈ మ్యాచ్ కు ముందు, భారత జోడీ మలేషియా జంటపై.. 6-2 హెడ్-టు-హెడ్ ఆధిక్యంలో ఉంది. ఇండియా ఓపెన్ మ్యాచ్ లో మలేషియన్లు గెలవగా.. ఈ మ్యాచ్ లో, సాత్విక్-చిరాగ్ జంట ప్రారంభం నుండి దూకుడుగా ఆడి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.