AP | వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. ఆస్తులను జప్తు చేసిన ఈడీ
వైసీపీ నేత విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. సత్యనారాయణకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. హయగ్రీవ ఫామ్స్ కు చెందిన 44.74 కోట్ల ఆస్తులను ఈడీ అధికారలు సీజ్ చేశారు. ఈ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్ట్ నర్ గద్దె బ్రహాజీలు సూత్రధారులుగా తేల్చింది.
ఎంవీవీ బిల్డర్, హయగ్రీవైన్ ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్, గద్దె బ్రహ్మాజీ, ఆయన భార్య చిలుకూరి జగదీశ్వరుడు, రాధారాణి ఆస్తులు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. అనాథలు, వృద్ధులకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ ప్రాజెక్టుకు చెందిన 12.51 ఎకరాల భూములను వీరు ఆక్రమించుకున్నారని ఈడీ నిర్ధారించింది. హయగ్రీవ ఫామ్స్ లోని ప్లాట్లను విక్రయించి సుమారు రూ.150 కోట్లు ఆర్జించారి ఈడీ తెలిపింది.
గత ఏడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, అతని భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. గతేడాది అక్టోబర్లో ఎంవీవీ, జీవీల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చివరకు ఎంవీవీ ఆస్తులను జప్తు చేసింది.