RR vs RCB | రాజ‌స్థాన్ పై బెంగ‌ళూరు సునాయ‌స విజ‌యం..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ ను వారి సొంత మైదానంలో ఢీకొన్న బెంగళూరు జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ విజ‌యంతో పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో ఉన్న ఆర్సీబీ… 3వ స్థానానికి చేరుకుంది. ఆర‌జస్థాన్ 7వ స్థానంలో కొన‌సాగుతోంది.

కాగా, ఈ మ్యాచ్ లో 174 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన ఆర్సీబీ.. రాజ‌స్థాన్ పై చెల‌రేగింది. ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్ (33 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్సుల‌తో 65), విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచ‌రీల‌తో దుమ్మురేపారు.

సాల్ట్ ఔట‌న త‌రువాత‌ వ‌న్ డౌన్ లో వ‌చ్చిన దేవ‌దుత్ ప‌డిక్కల్ (28 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సుతో 40 నాటౌట్) సైతం బౌండ‌రీల‌తో విరుచుకు ప‌డ్డాడు. దీంతో 17.3 ఓవ‌ర్ల‌లోనూ మ్యాచ్ ముగించేసిన‌ బెంగళూరు జట్టు.. రాజస్థాన్ పై సునాయాస విజయం సాధించింది.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు సాధించింది. ఆర్సీబీ బౌల‌ర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ స్వ‌ల్ప‌ పరుగులకే ప‌రిమితమైంది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్(47 75) మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. రియాన్ పరాగ్ (22 బంతుల్లో 30), ధ్రువ్ జురెల్ (23 బంతుల్లో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *