ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈరోజు రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. టోర్నమెంట్ లో వరుస పరాజయాల తర్వాత.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పునరాగమనం చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు… వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో దూసుకొచ్చిన ప్రమాదకరమైన జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.
టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ కూడా అంతకుముందు వరుస పరాజయాలను చవిచూసింది. అయితే, ఊహించని పునరాగమనం చేసిన ముంబై జట్టు వరుసగా ఐదు విజయాలతో మంచి జోష్ లో ఉంది.
గత మ్యాచ్ లో బలమైన గుజరాత్ ను ఓడించి ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్, వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్లు తలపడుతుండడంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ టోర్నీల్లో రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 30 మ్యాచ్ల్లో ఆర్ఆర్ జట్టు 14 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఎంఐ జట్టు 15 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి. ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2012లో జైపూర్లో విజయం సాధించింది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ.