అరుణాంజలి ఘటించిన ఎమ్మెల్యే, పలువురు ప్రముఖులు
కంటతడి పెట్టించిన కళాకారుల పాటలు
రవన్న పేరుతో విప్లవ గీతాలు..
మారుమోగిన అమర్ రహే నినాదాలు
భూపాలపల్లి, ప్రతినిధి/ టేకుమట్ల (ఆంధ్రప్రభ): ఆంధ్రా -ఒడిశా (AOB) సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి(maredumilli) అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి (gajarla ravi ) అలియాస్ గణేష్ కు అభిమానులు, ప్రజాసంఘాలు, బంధు మిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవ సూర్యుడు రవన్నకకు అంతిమ (last rites ) వీడ్కోలు పలికేందుకు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు రవన్న స్వగ్రామానికి భారీగా చేరుకోవడంతో.. వెలిశాల గ్రామం ఎర్ర జనసంద్రంగా మారింది. గాజర్ల రవి పార్థివ దేహానికి పూలమాల వేసి అరుణాంజలి ఘటించి శోకసముద్రంలోని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ యాత్రలో విప్లవ గీతాలు, విప్లవ నినాదాలతో విప్లవాల పోరుగడ్డ వెలిశాల ఎరుపెక్కింది. విప్లవ యోధుడికి అడుగడుగునా అరుణ జోహార్లు అర్పిస్తూఈ అంతిమయాత్ర జనకడలిని తలపించింది. చివరి మజిలీ వరకు కొనసాగింది. గాజర్ల కుటుంబం నుంచి ఇప్పటికే ఆరుగురు అమరులయ్యారు. గాజర్ల కుటుంబ విప్లవోద్యమ చరిత్ర విని కన్నీరు మున్నీరుగా ప్రజానీకం విలపించారు. గాజర్లది బూటకపు ఎన్ కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపించాయి. సుప్రీం కోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

మారణ హోమం ఆపాలి

- భారత్ బచావో అధ్యక్షులు గాదె ఇన్నయ్య
దేశ ప్రజలకు విముక్తి కోసం ఉద్యమించిన వ్యక్తి గాజర్ల రవి అలియాస్ గణేష్ అని, చంద్రబాబు మారణ హోమం ఆపాలి అని భరత్ బచావో అధ్యక్షులు తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఘాటుగా హెచ్చరించారు. ముందుగా గాజార్ల రవి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షా కాళ్ళు కడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసులకు కోసం అంబేడ్కర్ రాజ్యాంగంలో 5 వ షెడ్యూల్ అమలు కోసం రవి ఉద్యమించాడన్నారు. నరహంతక చంద్రబాబు గ్రేహౌండ్స్ బలగాలను వాడి పచ్చటి అడవుల్లో రక్తపుటేరులు పారిస్తున్నాడన్నారు. ఆపరేషన్ కాగర్ తో ఇప్పటికే 600 మందిని పొట్టన పెట్టుకున్నారని అమిత్షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్ వ్యాధితో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న గాజర్ల రవిని పట్టుకొని 12 గంటలు చిత్రహింసలు పెట్టిఅతి దారుణంగా చంపారని ఆరోపించారు. కుటుంభ సభ్యులకు రవి అనారోగ్యంతో ఉన్నడని ఇంటలిజెన్స్ వర్గాలతో సమాచారం ఇచ్చి కావాలనే హతమార్చారన్నారు . రవి మరణంతో దేశంలో ఓ సూర్య కిరణం అస్తమించిందని, హత్యాలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అస్తమించిన రవి దేశానికి వెలుగునిస్తాడన్నారు. నరమేధం సృష్టిస్తున్న ఆపరేషన్ కాగర్ ను వెంటనే ఆపాలని డిమాండ్ డిమాండ్ చేశారు.

విప్లవ గీతాలతో మార్మోగిన వెలిశాల
విప్లవ వీరుడు గాజర్ల రవి మృతితో అంతిమ యాత్రలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. పార్ధివ దేవాహం వద్ద కళాకారులు పాడిన విప్లవ గీతాలతో వెలిశాల పొరుగడ్డ హోరెత్తింది. అంత్యక్రియలు మొదలైన నుండి చివరి మజిలీ వరకు ఆధ్యాంతం విప్ల జోహార్లు అర్పిస్తూ కళాకారులు గీతాలు ఆలపించారు.వారి గీతాలు అందరిని కంట తడి పెట్టించాయి.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర నివాళి
మావోయినేత గాజర్ల రవి మృతిచెందగా భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ రావు రవి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి సోదరుడు మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ @ఐతు తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబాన్ని ఓదార్చారు.
అంతిమ యాత్రలో పాల్గొన్న పలువురు
గాజర్ల రవి అంతిమ యాత్రలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేషం సతీమణి పుష్ప, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంత, రాష్ట్ర కమిటీ సంఘం శోభ, సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ మాదన కుమారస్వామి, ఈసీ మెంబర్ పౌర హక్కుల సంఘం శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, కన్వీనర్ బాలసాని రాజయ్య, పౌర పవర్ ఆకుల సంఘం బండి శంకర్ , భరత్ బచావో,తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ కారుల నాయకులు గాదె ఇన్నయ్య, జంపన్న, సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రాసి నాయకులు, తెలంగాణ విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, రాదండీ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ, జిల్లా, మండల నాయకులు బుర్ర కొమురయ్య, మోటపోతుల శివ శంకర్,చందర్ గౌడ్, శేఖర్ నానీ, లక్ష్మా రెడ్ది,మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమ కారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.