నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్ (ఆంధ్రప్రభ) 21: భవిష్యత్ లో వ్యవసాయ రంగాన్ని యాంత్రీక రిస్తా మని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు వచ్చే ల పంటల సాగు చేయాల న్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూ చన తోనే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాట యిందన్నారు. త్వరలోనే రైతు భరోసా రైతు ఖాతా ల్లో వేస్తామని తెలిపారు. సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వ రరావు, జిల్లా ఇన్చార్జ్ మంత్రికి జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమం తు, టీపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ఎమ్మెల్యేలు దన్పాల్ సూర్య నారాయణ, పైడి రాకేష్ రెడ్డి, పోచారం శ్రీని వాస్ రెడ్డి, భూపతిరెడ్డి, ఈరవత్రి అనిల్ , జాతీ య బోర్డు చైర్మన్ పల్లె గంగారె డ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముఖ్య అతి థిలుగా హాజ రయ్యారు.
జిల్లా కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తాం … మంత్రి తుమ్మల
ఈ సభలో తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిజామాబాద్ జిల్లా కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తా మని తెలిపారు. తెలంగాణ లో సాగయ్యేప్రతి పంటకు కనీస మద్దతు ధర అమలు చేస్తామన్నారు షుగర్ ఫ్యాక్టరీలు పునరు ద్దరి స్తామని మంత్రి తెలిపారు. పసుపు బోర్డు లోరైతులకు ఉపయుక్తంగా కార్యక్ర మాలు చేపట్టాలన్నారు. ఆర్థికపరంగా ప్రభుత్వానికి
కష్టాలున్నా రూ 33 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. డ్రిప్ వ్యవసాయం చేసే రైతు లందరికీ ఏదడిగితే అది నిజామాబాదు జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి అం దజేస్తామన్నారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రం లో రైతు సంక్షేమ పథకాలకు సహా యం చేయాలని అడి గాం..అందుకు సానుకూల స్పందన వచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు.
వడ గండ్ల వానలు తదితర కార ణాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరి హారం కూడా త్వరలోనే అందజేస్తాం.రైతులు శాస్త్రవేత్తల సూచనలక నుగుణంగా సాగు చేస్తూ రైతు మహోత్సవవాన్ని సద్వినియోగం చేసుకోం డని మంత్రి తుమ్మల రైతులని కోరారు. యేటా పంటలను ఎంఎస్ పీకి కొని తక్కువ ధరకు కొని అమ్ము తూ నష్టపోతున్నా రైతు లు పండించే జొన్న, మక్క తదితర ఏ పంటనైనా కొంటామని తెలిపారు. ఆయిల్ ఫాం పంట వేయండి..ప్రభుత్వ సహ కారం ఉంటుంది..24 గంటల్లో కొని 24 గంటల్లో డబ్బులు మీ ఖాతాల్లో వేయిస్తామని మంత్రి తెలిపారు. ఆదాయం ఉన్న పంటలను పండించండి..ప్రకృతి, క్రిమి కీటకాలు వ్యాపార వర్గాలు రైతుల మీద దాడి చేస్తు న్నా వారినిఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు.
పెండింగ్ లో ఉన్న ఎంఎస్పీ, బోనస్ రెండు రోజుల్లో అకౌంట్లో వేస్తాం. – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎంఎస్పీ, బోనస్ విషయంలో రెండు రోజుల్లో రైతుల అకౌంట్లో అకౌంట్లలో వేస్తమని నీటి పారుదల,సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించి ప్రత్యేక చర్యలు చేపడతామన్నా రు. రైతుల్లో చైతన్యం అవగాహన పెంచేందుకు రైతు మహో త్సవం ఏర్పాటని అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజె క్టులకు గత ప్రభుత్వం 1.81 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి నీరివ్వ లేదు. ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తా మన్నారు.
నెలాఖరులోపు టెండర్లు పిలిచి నిజాం సాగ ర్ పూడిక తీయించి ఆయ కట్టుకు నీరందిస్తామ న్నారు. గుత్ప ఎత్తిపోతల ఎక్స్టెన్షన్ కు నిధులిచ్చి పూర్తి చేస్తాం..చెక్ డ్యాంలు అవసరమైన చోట నిర్మించి పూర్తి చేయిస్తామని ఉత్తంకుమార్ రెడ్డి తెలిపా రు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరం దించేలా చర్యలు చేపడుతున్నామని అన్నా రు.సన్నరకం బియ్యం రేషన్ షాపుల ద్వారా ఎక్కడా లేని విధంగా రూ 3 కోట్ల పది లక్షల మందికి తెలంగాణలో ఇస్తున్నా మని తెలిపారు. గత బిఆ ర్ఎస్ లక్ష కోట్లతో మొదలు పెట్టిన కాళేశ్వరం నిరుప యోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండించారు.దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ లో 281 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన ఘన త రైతులది రైతు ప్రభు త్వానిదన్నారు. తెలంగా ణలో సమర్దవంతంగా ధా న్యం కొనుగోలు ప్రక్రి య. ఎక్కడైనా లోపాలు జరిగితే నా దృష్టికి తీసుకురండని మంత్రి చెప్పారు.రైతు మహోత్సవం కార్యక్రమంలో అతిథులు మాట్లాడిన అనంతరం రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించి రైతులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు