Rain Hit | అకాల వర్షంతో రైతన్నలకు అపారనష్టం…

వాజేడు/ ఏటూరు నాగారం / మే 14 ఆంధ్రప్రభ: అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో రాత్రి తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం కారణంగా అన్నదాతలు ఆరుగాలం కష్టం పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి కొట్టుకుపోయింది దీనితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి గ్రామానికి చెందిన 50 మంది రైతులు 200 ఎకరాలలో వరి సాగు చేసి ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టారు రాత్రి తెల్లవారుజామున అకాల వర్షం సంభవించడంతో పక్కనే ఉన్న జీడివాగు ఉప్పొంగి ప్రవహించి ఐకెపి సెంటర్ లోకి భారీగా వర్ధనీరు చేరడంతో ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయింది దీనితో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం జరిగిందని, ఆరు గాలం ప్రశ్నించే పండించిన రైతుకు కన్నీరే మిగిలిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మడానికి తెచ్చిన వడ్లతోపాటు వడ్ల బస్తాలు కూడా కొట్టుకుపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. రైతుల కళ్ళముందే తమ పండించిన పంట కొట్టుకుపోతుంటే ఏమి చేయలేక దిక్కు తోచని స్థితిలో రైతులు ఆర్తనాదాలు పెట్టారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజాసంఘాల నాయకులు రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అధైర్య పడకండి ఆదుకుంటాం ‍- ‍‍ కాంగ్రెస్ నేతల మనోధైర్యం

అకాల వర్షం కారణంగా అపార నష్టం జరిగి మారి స్థాయిలో నష్టపోయిన గోగుబెల్లి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు అధైర్య పడద్దని కాంగ్రెస్ నేతలు మనోధైర్యాన్ని పెంపొందించారు సంఘటన స్థలానికి చేరుకొని కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. పకృతి వైపరీత్యా రైతులకు బారి నష్టం జరిగిందని దీనిపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి అధ్యక్షులకు నష్టపరిహారం చెల్లించే విధంగా మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వెళ్తామని రైతులకు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.

Leave a Reply