Telangana | రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా

Telangana |రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

Telangana |భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల స్వగ్రామమైన రహత్నగర్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ₹50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, మాజీ డీసీసీ నాయకుల తో కలిసి పాల్గొన్నారు.

టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ..
*బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది.గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి ₹380 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ రహత్నగర్ టెంపుల్ కారిడార్ రోడ్తో కరీంనగర్–నిజామాబాద్ మధ్య సెంటర్ పాయింట్ అవుతుంది. గ్రామానికి స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయి. గ్రామ అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావిస్తున్న. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

