ఢిల్లీ : ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జార్ఖండ్ మాజీ సీఎం (former Jharkhand CM) శిబు సోరెన్ (Shibu Soren)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పరామర్శించారు. ఇవాళ ఆసుపత్రికి వెళ్లిన రాష్ట్రపతి.. అక్కడ శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిశారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ ఆరోగ్య పరిస్థితి గురించి హేమంత్ సోరెన్ను అడిగి తెలుసుకున్నారు.
81 ఏళ్ల శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి (Gangaram Hospital) లో శిబు సోరెన్కు చికిత్స కొనసాగుతోంది. అయితే, రాష్ట్రపతి ముర్ము 2015 మే నుంచి 2021 జులై వరకూ జార్ఖండ్ గవర్నర్గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిబు సోరెన్తో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే మాజీ సీఎంను రాష్ట్రపతి పరామర్శించారు.