దిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్ భూకంప పరిస్థితులపై అక్కడి మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విపత్తులో ప్రజలు మృతిచెందడంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశమైన మయన్మార్ ప్రజలకు అండగా ఉంటామన్నారు. ‘ఆపరేషన్ బ్రహ్మ’లో భాగంగా ఆ దేశానికి విపత్తు సహాయక సామాగ్రి, దళాలను పంపిస్తున్నట్లు మోడీ తెలిపారు.