petrol| పవర్ పెట్రోల్ ధర పెంపు

petrol| పవర్ పెట్రోల్ ధర పెంపు
లీటర్పై రూ.2.35 పెరుగుదల
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గల్ఫ్ యుద్ధం ప్రభావంతో పవర్ పెట్రోల్ ధరను లీటర్కు రూ.2.35 పెంచారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. మరోవైపు క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేవని హెచ్పీసీఎల్ పేర్కొంది. ముడి చమురుతో మరిన్ని నౌకలు రానున్నాయని చెప్పింది.
