PDS | ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ – కేంద్రం నిర్ణ‌యం

న్యూ ఢిల్లీ – రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్దిదారులకు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *