ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లిన పంజాబ్ – ముంబై జట్లు.. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానం కోసం నేడు అమీ తుమీ తలపడనున్నాయి.
కాగా, జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది.
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జేమీసన్, అర్ష్దీప్ సింగ్, వైషక్ విజయ్కుమార్.