Monsoon Session : మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు

న్యూ ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై తీవ్ర చర్చలు జరగనున్నాయి.

మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది, ఇందులో 8 కొత్త బిల్లులు ఉండనున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక అంశాలపై చర్చకు ఇదొక కీలక వేదికగా మారబోతోంది.కేంద్రాన్ని నిలదీయాలనే విపక్షాల లక్ష్యంఈ సమావేశాల్లో కేంద్రాన్ని ఆపరేషన్ సిందూర్, బిహార్ ఓటర్ లిస్ట్ సవరణ, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, మహిళలపై పెరుగుతున్న హింసా ఘటనలు, నిరుద్యోగ సమస్య వంటి కీలక అంశాలపై విపక్షాలు ఘాటుగా నిలదీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రజల దృష్టిని ఆకర్షించే పలు సమస్యలపై చర్చించి కేంద్రాన్ని బలమైన ప్రశ్నలతో కోణంలోకి తేవాలనే వ్యూహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు ఉత్కంఠభరితంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply