వారి ఉంటున్న ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు పాక్ ప్రకటన
అందులో ఉన్న వారు బతికే అవకాశం లేదని దృవీకరణ
ఈ ఇద్దరు ఉన్న ప్రాంగణంలోనే 70 మంది టాప్ కమాండర్ లు మృతి
న్యూ ఢిల్లీ – భారత్ ఈ తెల్లవారుజామున పాకిస్థాన్ లోని తొమ్మిది ప్రాంతాలో ఉన్న ఉగ్రవాద శిబిరాలలపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది.. ఉగ్రవాద అగ్రనేతలు మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ ఉంటున్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వారు మరణించారనే కథనాలు వినిపిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు దాడులు జరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్గా ఉందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక, పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉందని తేల్చింది. కాగా ఈ స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఉన్న వారు బతికే ఉండే అవకాశాలు లేవని పేర్కొంది.
మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతం ..
ఈ దాడిలో భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రనేతలు హఫీజ్ సయీద్ , మసూద్ అజహర్ హతమయ్యారా? అంటే అవునని పాకిస్థాన్ అంటుంది. అయితే పూర్తిగా దృవీకరించలేమని తెలిపింది. భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్లో వారి ప్రధాన కార్యాలయం , మదర్సా నేలమట్టం అయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైష్-ఎ-మహ్మద్కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఇందులో ఉంటున్న మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ లు పరిస్థితి తెలీయరాలేదని అక్కడి అధికారులు అంటున్నారు.. అంతేకాకుండా, మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పూర్తిగా తుడుచుపెట్టుపోయాయి.
భారత్ దాడి చేసిన ప్రాంతాలు ఇవే
ముజఫరాబాద్లో 2 స్ట్రైక్లు, బహవల్పూర్లో 3వ స్ట్రైక్, కోట్లీలో 4వ , చాక్ అమ్రూలో 5వ దాడి, గుల్పూర్లో 6వ , భింబర్లో 7వ దాడి, మురీద్కేలో 8వ, సియాల్కోట్లో 9వ దాడి.