14న ఇండియా, పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025 రేప‌టి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 20 రోజుల పాటు జ‌రిగే ఈ టోర్నీలో టీమిండియా (Team India) ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. యూఏఈ, హాంగ్ కాంగ్, ఒమన్‌‌‌‌‌‌‌‌ సంచలనాలు సృష్టించేందుకు సై అంటున్నాయి. తొలిసారి ఆసియా కప్ లో 8 జట్లు ఆడుతుండడంతో ఈ టోర్నీ ఆసక్తిగా మారింది.

దుబాయ్‌లో మ్యాచ్‌లు
దుబాయ్ (Dubai) వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ (International Cricket) స్టేడియంలో సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో ఇండియా, పాకిస్తాన్ (Pakistan), యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. టీ20 ఫార్మాట్ (T20 format)లో జరగనున్న టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. . ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది. సూపర్ 4 సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28న జరగనున్న టోర్నమెంట్ ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. ఆసియా కప్ మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్ ఇండియాలోని సోనీ స్పోర్ట్స్ (Sony Sports) నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. సోనీ లైవ్ ఆప్ లో లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

Leave a Reply