Ranger Captured |భారత భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ రేంజర్‌

న్యూ ఢిల్లీ |సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ రేంజర్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పట్టుకున్నారు. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. భారత్‌-పాక్‌ సరిహద్దులోకి ఓ పాక్‌ రేంజర్‌ చొరబడ్డాడు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. వెంటనే గమనించిన జవాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భారత్‌-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలోపాక్‌ రేంజర్‌ భారత్‌ భూభాగంలోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది.

కాగా, ఇటీవల అనుకోకుండా భారత సరిహద్దు దాటి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పూర్ణం కుమార్ షాను పాక్‌ ఆర్మీ నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23న పంజాబ్ బోర్డర్ లో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ విడుదలకు భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆయనను విడుదల చేయడం కుదరదని పాక్‌ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పాక్‌ రేంజర్‌ భారత భద్రతా దళాలకు చిక్కడం ఆసక్తికరంగా మారింది

Leave a Reply