Pak | దాడి చేయాలని అనుకున్నాం – అయితే భారత్ ముందుగా అటాక్ చేసింది – ఒప్పుకున్న పాక్ ప్రధాని

ఇస్లామాబాద్ – పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు.

పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్‌లో ప్రస్తుతం షహజాబ్ షరీఫ్ పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ వ్యా్ఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షన్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం మే 10 ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే, తెల్లవారకముందే పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై భారత్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ని ప్రయోగించిందని పాక్ ప్రధాని అన్నారు.

.“మే 9-10 రాత్రి, భారత దురాక్రమణకు మేము తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాము. గుణపాఠం నేర్పడానికి ఫజ్ర్ ప్రార్థనల తర్వాత ఉదయం 4.30 గంటలకు మన సాయుధ దళాలు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ గంట రాకముందే, భారతదేశం మరోసారి బ్రహ్మోస్‌ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించింది,

రావల్పిండిలోని విమానాశ్రయంతో సహా పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది” అని షరీఫ్ లాచిన్‌లో తన ప్రసంగంలో అన్నారు.

పాకిస్తాన్‌పై మే 10న భారత్ తీవ్ర దాడి చేసింది. భారత సైనిక స్థావరాలు, సివిల్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణులని పాకిస్తాన్ ప్రయోగించిన తర్వాత, భారత్ పాక్ వైమానిక ఆస్తులే లక్ష్యంగా విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ అయిన రావాల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్‌తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్ మరియు చునియన్‌లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసింది. స్కార్డు, భోలారి, జకోబాబాద్ మరియు సర్గోధాలోని వైమానిక స్థావరాలు కూడా విస్తృతంగా దెబ్బతిన్నాయి. మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *