బాసర, ఏప్రిల్ 30 (ఆంధ్రప్రభ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి బుధవారం అక్షయ తృతీయను పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణం గంగాస్థన్ కు చెందిన జి సుఖేందర్ రెడ్డి సుమారు మూడు లక్షల ఎనభై వేల రూపాయల విలువగల మూడున్నర తులాల బంగారు గొలుసును ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి కి అందజేశారు.
అమ్మవారి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి గొలుసును వాడాలని భక్తుడు సూచించాడు. అనంతరం అమ్మవారికి బంగారు గొలుసు ప్రధానం చేసిన జి.సుఖేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఆలయ ఇన్ స్పెక్టర్ నరేశ్, సిబ్బంది ఉన్నారు.