Notice | రెండో రోజూ కేసీఆర్​తో హ‌రీశ్‌రావు భేటీ

సిద్దిపేట, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కలిశారు. గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి ఆయన వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ అంశంలో తదుపరి కార్యాచరణపై నేతలిద్దరూ చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగ‌తి విదిత‌మే. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా ఇచ్చిన సంగ‌తి విదిత‌మే.

15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Leave a Reply