Nizamabad | వామ్మో… కిట్టమూర్తి దవాఖానాలు! కాంపౌండరే వైద్యుడు…

నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 5:(ఆంధ్రప్రభ) వైద్యో నారాయణ హరి… అంటూ వైద్యుడిని దేవుని ప్రతిరూపంగా కొలుస్తారు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తినీ ఇందూర్ లో పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు. వామ్మో సర్కారు దవాఖానా లో నాణ్యమైన వైద్యం అందడం లేదంటే ఒక లెక్క.. కానీ ఇందూరులో అందుకు భిన్నంగా.. వా మ్మో కిట్ట మూర్తి దవాఖా నాలలో వైద్యం అంటే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. కిట్టమూర్తి దవాఖానాలలో ఒక ఆసు పత్రిలో… కాంపౌండరే వైద్యుడుగా అవతార మె త్తి కంటి పరీక్షలు చేయడ మే కాకుండా డాక్టర్ ప్రీస్కి ప్షన్ పై ఏకంగా మందు లు కూడా రాసి ఇస్తు న్నా డు.

కిట్టమూర్తి సార్ మరో దవాఖానాలో ఆస్ప త్రి బోర్డుపై కృష్ణమూర్తి డాక్టర్ అని పెద్దపెద్ద అక్ష రాలతో ఉంటుంది. కానీ ఆసు పత్రిలో అర్హత లేని వ్యక్తి వైద్య పరీక్షల చేయడమే కాకుండా డాక్టర్ చీటీపై ఏకంగా మందులు కూడా రాస్తున్నాడు. ఓపి పరీక్ష లు మాత్రం కృష్ణ మూర్తి చేసినట్టు కంప్యూ టర్ రిసిప్ట్లు రోగులకు ఇస్తు న్నారు. కృష్ణమూర్తి డాక్టరే అక్కడ లేడు కానీ కృష్ణ మూర్తి డాక్టర్ చీటీ పైనే మందులు ఇవ్వడమే కాకుండా… కృష్ణమూర్తి డాక్టరే పరీక్షలు చేసినట్టు అమాయక ప్రజలను బురి డీ కొట్టిస్తున్నారు.ఈ లెక్క న ఈ రెండు ఆసుపత్రు లలో అర్హత లేని వారే వైద్యులుగా అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతు న్నారు. ఇందూర్ ప్రైవేట్ దవాఖానాల రూటే సప రేటు. కాసుల కోసం కక్కు ర్తి పడి ప్రైవేట్ దవాఖా నాలు బరి తెగించి వ్యా పారం చేస్తున్నాయి. . ఈ ఘటనపై విచా రణ చేపట్టి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *