Nirmal | నారీనారీ న‌డుమ మురారీ

ఇద్ద‌రి యువ‌తుల‌ను ప్రేమించి పెళ్లాడాడు!
మూడు కుటుంబాలు అంగీకారం
నిర్మ‌ల్ జిల్లాలో అరుదైన ప్రేమ వివాహం

నిర్మ‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నిర్మల్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో అరుదైన ప్రేమ వివాహం జరిగింది. ఒకే మండపంలో ఇద్దరు యువతులను ప్రేమించి, వారిద్దరి సమ్మతితో ఓ యువ‌కుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై వ‌రుడు, వ‌ధువులును ఆశీస్సులు అందజేశారు. గుమ్నూర్‌కు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు.. లాల్ దేవి, జలకర్ దేవి అనే యువతులను ప్రేమించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు తెలుసుకొని, ముగ్గురు ఒప్పందం చేసుకుని ఈ వివాహాన్ని అధికారికంగా అంగీకరించారు. వివాహానికి ముందు, మూడు కుటుంబాల సమ్మతితో బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్య తీసుకున్నారు.

గ్రామ‌స్థుల స‌మ‌క్షంలో
గ్రామస్థుల సమక్షంలో ఘనంగా జరిగిన వివాహ వేడుకలో రెండు కుటుంబాల పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంప్ర‌దాయ‌ బద్ధంగా సూర్యదేవ్, లాల్ దేవి, జలకర్ దేవి వివాహ బంధంతో ఏకమయ్యారు. ఈ అరుదైన పెళ్లి గురించి తెలుసుకున్న ఇతర గ్రామాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *