సంగారెడ్డి, ఫిబ్రవరి 20 (ఆంధ్రప్రభ ) : సంగారెడ్డిలోని పద్మావతి ప్రైవేట్ ఆసుపత్రిలో కొండాపూర్ మండలం, గారకుర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముక్కునొప్పిగా ఉందని ఆస్పత్రిలో చికిత్సపొందాడు. ఆపరేషన్ చేసిన అనంతరం డాక్టర్లు అతన్ని ఐసీయూలో ఉంచగా అర్ధరాత్రి మృతిచెందాడు.
ఈ విషయం తమకు చెప్పకుండా డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ మృతికి డాక్టర్ నిర్లక్షమే కారణమని, తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపైన నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంగారెడ్డి టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.