భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. భారత టెరిటోరియల్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో విభాగంలో భారత్కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ని అందించి నీరజ్ చోప్రా భారత ఖ్యాతిని నిలబెట్టాడు. తండ్రి సతీష్ కుమార్ భారత సైన్యంలో పనిచేయగా… నీరజ్ చోప్రా ప్రస్తుతం నాయిబ్ సుబేదార్ రాజ్పుతానా రైఫిల్స్ హోదాను కలిగి ఉన్నాడు.