భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మరో గౌరవం దక్కింది. క్రికెట్ కు చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ధోనిని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చింది. లండన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హేడెన్, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్, డేనియల్ వెట్టోరి, సనా మీర్, సారా టేలర్లను కూడా హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చారు.
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ “ఈ గౌరవం జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రికెటర్లతో నా పేరును చేర్చినందుకు గర్వంగా ఉంది.” అని పేర్కొన్నారు. ధోనీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన 11వ భారతీయుడిగా నిలిచారు.
ఇదిలా ఉండగా, ధోని తన అంతర్జాతీయ కెరీర్లో 538 మ్యాచ్లు ఆడి 17,266 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా 829 అవుట్లను నమోదు చేశాడు. ధోని నాయకత్వంలో టీమిండియా 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.