TG | 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఈ జిల్లాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సెల‌వు !

రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాడావుడి నెల‌కొంది. ఈ నెల 27న కరీంనగర్‌ – ఆదిలాబాద్‌ – నిజామాబాద్‌ – మెదక్‌ గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

ఈ నేప‌థ్యంలో ఈనెల 27న ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఈవో ఆదేశాల మేరకు ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఆయా జిల్లాల్లోని ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఓటింగ్ లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలు, యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ఆయా సంస్థల యాజమాన్యాలు షిఫ్ట్ లను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *