MLA | ఓటు వేసి గ్రామాభివృద్ధికి తోడ్పడండి
MLA | షాద్నగర్, ఆంధ్రప్రభ : తనకు ఓటు వేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్ అన్నారు. తాను సర్పంచ్గా ఎన్నికైతే రాయికల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాయికల్ నుండి రామేశ్వరం వరకు డబుల్ రోడ్డు(Double road)కు నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలలను కల్పిస్తానని అన్నారు. ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) ఆశీస్సులతో తాము కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నామన్నారు. యువ మహిళ అయిన తనకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు.

