MLA | ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం

MLA | ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం
- ప్రకృతిని రక్షించండి
- ఎమ్మెల్యే మాధవరెడ్డి
MLA | నర్సంపేట, ఆంధ్రప్రభ : మేడారంను ప్లాస్టిక్ రహిత జాతర చేయడమే లక్ష్యంగా ప్లాస్టిక్ నిషేధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్లాస్టిక్ వాడకండి, మేడారంను రక్షించండి అనే వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ… అత్యంత తిష్టాత్మకంగా జరిగే మేడారం జాతరలో ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా మీ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ గాలి, నీరు, భూమిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడి పై ఉందన్నారు.
జాతరకు వెళ్ళే భక్తులు ప్లాస్టిక్ రహిత వస్తువులు స్టీల్ ప్లేట్స్, గ్లాస్, బాటిల్స్ కు బదులుగా మట్టి పాత్రలు, గుడ్డ సంచులు వాడుతూ పర్యావరణ పరిరక్షించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి పిలుపు నిచ్చారు. సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ… మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ఇంటి దగ్గర నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను తీసుకెళ్లి వాడుతూ, మేడారం అడవి తల్లిని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, గండిగిరి, సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్, రాముసేవక్, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ రాజహంస, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
