ముంబై : వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రక్షణాత్మక స్కోరు నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. టాస్ ఓడిన తర్వాత ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబద్ ను… ముంబై జట్టు తమ పటిష్టమైన బౌలింగ్తో కట్టడి చేయగలిగింది.
ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. హైదరాబాద్ బ్యాటర్లలో, పంజాబ్ పై సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ… ఈ మ్యాచ్ లోనూ రాణించాడు. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్లతో 40), ట్రావిస్ హెడ్ తో తొలి వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ట్రావిస్ హెడ్ (28), నితిష్ కుమార్ రెడ్డి (19) పరుగులకు ఔటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37) ఆకట్టుకున్నాడు. ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 2 సిక్సులతో *18 నాటౌట్) మెరిశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (8) నాటౌట్ గా నిలిచాడు.