ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ థ్రిల్లింగ్ విజయ సాధించింది. అయితే, వర్షం కారణంగా ఎంపైర్లు మ్యాచ్ ను 19 ఓవర్లు కుందంచారు. దీంతో గుజరాత్ జట్టు 19వ ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపక్ చాహర్ బైలింగ్ వేశాడు. ఆ ఓవర్లో ఒక వికెట్ తీపిర దీపక్ చాహర్.. 15 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో గుజరాత్ జట్టు 3 వికెట్లతో విజయం సాధించింది.
గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభమన్ గిల్ (46 బంతుల్లో 43), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (15 బంతుల్ల్ఓ 28) పరుగులు సాధించారు. ఇక ఆఖర్లో తెవాటియా (11), కొయెట్జీ (12) ధనాధన్ బౌండరీలతో గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చారు.
ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో గుజరాత్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.