మీడియాకు వివరాలు వెల్లడించిన ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు
ఢిల్లీ: పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని, భారత్లోని 26 ప్రదేశాల్లో పాక్ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్ట్రీ, సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్పై అధికారులు వివరాలను వెల్లడించారు. ఉద్రిక్తతలపై తాజా పరిస్థితులను కర్నల్ సోఫియా ఖురేషి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది పాక్. ముఖ్యంగా శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని సోఫియా ఖురేషి తాజాగా వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆమె తెలిపారు. అయితే భారత సైన్యం వారి చర్యలను అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోందని తెలిపారు
పాకిస్తాన్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందరి ఆమె వెల్లడించారు. శుక్రవారం రాత్రి వారు ఏకంగా 24 చోట్ల మన వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించారని, శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వంటి కీలకమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. కానీ భారత సైన్యం వారికి గట్టి జవాబు ఇచ్చిందని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. పాకిస్తాన్లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని తెలిపారు. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురిద్, షోర్కోట్లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖండాంతర మిస్సైల్ తో దాడి చేశామన్నారు..,ఆ నాలుగు ఎయిర్ బేస్ లు పూర్తిగా ధ్వంసమయ్యాని తెలిపారు.,
పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతోందని ఆమె తెలిపారు. శ్రీనగర్, ఉధంపూర్, బటిండాలో దాడులు జరుపుతోంది. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేసిందని తెలిపారు. భుజ్, బటిండాలోని ఎయిర్స్టేషన్లలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు.. లాంగ్ రేంజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్ ఈ దాడులను జరిపిందని చెప్పారు.. అయితే వాటన్నింటిని మన ఎయిర్ రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయన్నారు.. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడికి దిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.పాకిస్తాన్ మిస్సైల్స్ను భారత వాయుసేన తిప్పి కొట్టిందని తెలిపారు . ఇదే సమయంలో. పాక్ ఎయిర్బేస్లను గట్టిగా దెబ్బతీశామన్నారు… పాక్ దాడులు చేసిన ప్రతీచోటా భారత్ గట్టిగా ప్రతిఘటించిందన్నారు.. పాకిస్తాన్ హైస్పీడ్ మిస్సైల్ మోర్టార్లను ప్రయోగించిందన్నారు.
సరిహద్దుల దిశగా పాక్ సైన్యం ..
పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని సోఫియా ఖురేషీ పేర్కొన్నారు. “పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లను వాటి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. చాలా ముప్పులను భారత్ తిప్పికొట్టింది. కానీ, 26 చోట్ల పాక్ ఆయుధాలు గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి. అవి ఉధంపుర్, భుజ్, పఠాన్ కోట్, భటిండా వాయుసేన స్థావరాల్లోని పరికరాలను దెబ్బతీసి, సిబ్బందిని గాయపర్చాయి. తెల్లవారుజామున 1.40 సమయంలో పాక్ హైస్పీడ్ మిసైల్స్ పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై దాడులు చేసింది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపుర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసింది. ఇది రెచ్చగొట్టే చర్య అని కచ్చితంగా తెలుస్తోంది.
దీనికి తగినట్లు ప్రతిస్పందిస్తూ.. భారత దళాలు పాక్ లోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్లపై దాడులు చేసింది. వీటిల్లో రఫీకీ, మురిద్, చక్రాల, రహిమ్ యార్ ఖాన్, | సుక్కర్, చునియాన్ స్థావరాలు ఉన్నాయి. ఫైటర్ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు నిర్వహించాం. పస్రూర్లో రాడార్ కేంద్రం, సియాల్ కోట్ ని ఏవియేషన్ బేస్ ను ధ్వసం చేశాం. ఈ దాడుల సందర్భంగా పౌరులు ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం.
పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదకర చర్య” అని పేర్కొన్నారు.
ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్లభాషలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్ స్టాంప్లు ఉన్న వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. పటాన్ కోట్ , ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడికి దిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టాం. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు అని అన్నారు. మన ఎయిర్ రక్షణ వ్యవస్థలకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు.
విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ మాట్లాడుతూ శిర్సా, సూరతర్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ చెప్పడం పూర్తిగా తప్పు. దీంతోపాటు ఆదంపుర్ లోని ఎస్-400, బ్రహ్మోస్ మిసైల్ డిపో, పలుచోట్ల ఎయిర్ఫోల్డ్లను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మోద్దని చెప్పారు. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. రాజోరిలో జరిగిన దాడుల్లో అదనపు డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ ధాఫా చనిపోయారు అని తెలిపారు.