Maoism End : మావోయిజం అంతం
- మారేడుమిల్లిలో మరో ఎన్ కౌంటర్
- ఏడుగురు మావోయిస్టులు మృతి
- అగ్రనేతలు తిప్పరి..ఆజాద్ మరణంపై అనుమానాలు?
- క్లైమ్లాక్స్ దశలో.. ఆపరేషన్ కగార్
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )

అ.. అడవి, ఆ.. ఆయుధం ఈ రెండు పదాలు తప్పా ఆదివాసీలకు తెలీదు. శ్రీకాకుళంలో గిరిజన సాయుధ పోరాటం బీజంతో.. ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీ ఇక అంతరించినట్టే. అంటే మావోయిస్టు చరిత్రకు అతి త్వరలోనే తెరపడుతోంది. కీలక నేతలందరినీ అంతం చేసే దశకు కగార్ ఆపరేషన్ చేరింది. ఏపీ మారేడు మిల్లి అడవిలో .. కేంద్ర హోంశాఖకు కొరకరాని కొయ్యగా మారిన చత్తీస్ గడ్ ఏకైక గిరిజన మావోయిస్టు కీలక నేత మాడ్వి హిడ్మా తన భార్య రాజే, తన అత్యంత సన్నిహితులతో మృతి చెందిన కొన్ని గంటల్లోనే .. ఏపీలో పోలీసులు చెలరేగిపోయారు. ఏపీలోని షెల్టర్ జోన్ లో తలదాచుకున్న మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే బుధవారం మావోయిస్టు పార్టీకి పిడుగులాంటి వార్త అందింది. మారేడుమిల్లిలో (Maredumilli) మరో ఏడుగురు మావోయిస్టులు (Seven Maoists Encounter) ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.
తాజా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి, మరో కీలక నేత ఆజాద్ మృతి చెందినట్టు కబురు వైరల్ అవుతోంది. నిజానికి మంగళవారమే తిప్పరి తిరుపతిని, మరో 12 మంది అంగరక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మీడిమాలో ప్రచారం జరిగింది. కానీ విజయవాడలో బుధవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఏపీ ఎడిషనల్ డీజీ మహేష్ లడ్డా మాట్లాడుతూ.. తిప్పరి తిరుపతి ఇంకా దొరకలేదు, అతడి జాడ కోసం గాలిస్తున్నాం, అని స్పష్టం చేశారు.
ఇక హిడ్మా ఎన్ కౌంటర్ పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కగార్ ఆపరేషన్ తారా స్థాయికి చేరిన తరుణంలో.. బిడ్డ లొంగిపో,,జనంలో కలిసి పో అని హిడ్మా తల్లి విలేఖరుల సమావేశంలో వేడుగకుంది. తల్లి మాట ప్రకారమే.. లొంగుబాటను ఎంచుకున్న హిడ్మా దండకారణ్యాన్ని వీడి ఏపీలోని షెల్డర్ జోన్ కు చేరుకోగా.. కీలక సమాచారంతో పోలీసులకు దొరికిపోయాడని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. హిడ్మాను తాము పట్టుకోలేదని, అతడే మారేడుమిల్లి అడవిలో మకాం వేశాడని, ఎదురు కాల్పులకు దిగి చనిపోయాడని ఏపీ అడిషనల్ డీజీ మహేశ్ లడ్డా స్పష్టం చేశారు.
Maoism End : మావోయిస్టు అగ్రనేతల మటాష్
2026 మార్చి 31 డెడ్ లైన్. (Dead Line). అడ్వాన్స్ గా క్లైమాక్స్ (Advance ClimaX) దశకు చేరింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి, మరో కీలక నేత వాసుదేవరావు ఆయుధాలు సహా తన పటాలంతో లొంగిపోయిన వెంటనే.. ఆపరేషన్ కగార్ (Operation) అంతిమ స్థితికి చేరిందని .. దండకారణ్యంలో గిరిజనులు ఓ నిర్ణయానికి వచ్చారు. మరో ఇద్దరు బండి ప్రకాష్, చంద్రన్న ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు (Mallojula Venugopal, Asanna0 , వాసుదేవరావు పదే పదే .. లొంగిపోండి..లేదో చస్తారు, అని ప్రకటనలు జారీ చేస్తున్నారు. లొంగిపోయే మావోయిస్టులు తమకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్ కూడా విడుదల చేశారు.
Maoism End : విజయవాడలో ఏం జరిగింది?
దండకారణ్యంలో మల్లోజుల , ఆశన్న లొంగిపోవటంతో… మావోయిస్టు పార్టీ కీలక సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆయుధాలు సమర్నించిన ఈ నేతలు.. మొత్తం పార్టీ సమాచారం లీక్ చేస్తారని పసిగట్టిన మావోయిస్టు అగ్రనేతలు అలెర్ట్ అయ్యారు, తమ యాక్షన్ టీమ్ ల కోసం ఏపీలో షెల్డర్ జోన్ లు ఏర్పాటు చేశారు. కానీ.. అలా లొంగుబాటు ప్రస్తానానికి ముందే ఏపీ పోలీసులు ముందస్తు ప్లాన్ సిద్ధం చేశారు. గతంలో ఎక్కడెక్కడ మావోయిస్టుల మూలాలు ఉన్నాయో? వెనక్కి తీశారు. ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. పోలీసుల ప్లాన్ సక్సెస్ అయింది. ఏపీ పోలీస్ నిర్వహించిన షెల్డర్ ఆపరేసన్ లో 27 టార్గెట్ లో ఉన్నారు. వీరిలో హిడ్మా సౌత్ బస్టర్ కమిటీ ( South Bastar committee), లోకల్ కారిడార్ ఆఫ్ చత్తీసగఢ్ కమిటీల సభ్యులు ( Local Carridor oF Chattisgarh) ఉన్నారు.
ఈ సమాచారం ఏపీ పోలీసులకు క్షుణ్ణంగా చేరింది. ఇక మావోయిస్టులపై పై నిఘా పెట్టారు. కార్యకలాపాల్ని పసిగట్టారు. కానీ దాడులు చేయలేదు. పూర్తి సమాచారంతో అన్నీ సెట్ చేసుకుని ఏకకాలంలో పట్టేశారు . విజయవాడ, ఏలూరు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లోని షెల్డర్ జోన్లపై (Shelter Xones) నిఘా పెంచారు. మంగళవారం హిడ్మా ఎన్ కౌంటర్ (Hidma Encour) తరువాత .. అతడి మరణ వార్త తెలియగానే ఏపీలో తలదాచుకున్న మావోయిస్టులు మకాం మార్చే అవకాశం ఉందని ముందుగానే భావించిన పోలీసులు డ్రోన్లను (Drone) ప్రయోగించి మరీ 50 మంది పీజీఎల్ ఏ యాక్షన్ టీమ్ ను పట్టేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు
ఏపీ చరిత్ర లో ఈ ఆపరేషన్ (Operation) లో కీలక నేతలను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తిప్పరి తిరుపతి (Tippari Tirupati) , ఆజాద్ సహా 12 మంది చిక్కారని మంగళవారం సాయంత్రమే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో దొరికిన చత్తీస్ గడ్ యాక్షన్ టీమ్ (Action Team) నుంచి 45 (Wepons) ఆయుధాలు, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్ (Magzine) లు , 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.
Maoism End ఇక దేవ్ జీ స్థితే సస్పెన్స్ …

మంగళవారమే అదుపులోకి తీసుకున్న 12 మంది కీలక మావోయిస్టులను మళ్లీ ఏజెన్సీకి తరలించి.. వీరిలో ఏడుగుర్ని ఎన్ కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ పన్నెండు మందిలో దేవ్ జీ ( Dev ji) , ఆజాద్ (Azad) ఉన్నారని చెబుతున్నారు. కానీ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వీరిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇంతకీ ఈ ఏడుగురు ఎవరు? వీరిలో తిప్పరి తిరుపతి ఉన్నాడా? లేడా? ఆజాద్ సంగతేంటీ? మరో వైపు ఏవోబీలో పోలీసులు (Police Alert) అలెర్ట్ అయ్యారు.
అడవిని జల్లెడ పడుతున్నారు. గిరిజన వాడలపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే.. ఈ ఎన్ కౌంటర్ నుంచి మరి కొందరు తప్పించుకున్నారని. (Escaped) వీరి కోసం జల్లెడ పట్టామని పోలీసులు చెబుతున్నారు. ఎనీ హౌ .. కగార్ ఆపరేషన్.. తుది దశకు చేరింది. ఇక జన స్రవంతిలో భూపతి, ఆశన్న హవా (Bhupathi , Asanna) తెరమీదకు రావటం ఖాయమని గిరిజనులు గుసగుసలాడుతున్నారు. మరో వైపు మావోయిసక్టు బీఆలతో పోరుబాటలో నడిచిన ఆదివాసీలు సైతం తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది.

