Manikonda | శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

హైదరాబాద్ – మణికొండ పట్టణంలో ని పంచవటి కాలనీ లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం లో ఆదివారం ఉగాది ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం బ్రహ్మశ్రీ సునీల్ శర్మ పంచాంగ శ్రవణంజరిగింది

అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లలితా కామేశ్వర స్వామి వారికి కూడా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.వేదపండితుల చేత నిర్వహిస్తున్నఉగాది ఉత్సవాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తుల విశేషం గా పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అన్ని పర్వదినాలకు దేవాలయం లో ఉత్సవాలు అత్యంత వైభవంగా గా నిర్వహిస్తున్న కమిటీ వారిని స్థానిక కాలనీ వాసులు,భక్తులు అభినందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *