కడెం, ఏప్రిల్ 26 (ఆంధ్రప్రభ) : తేనె తీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన కడెం మండలంలో చోటు చేసుకుంది. కడెం పీఎస్ ఎస్ఐ యమ్ కృష్ణ సాగర్ రెడ్డి కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన కుర్ర మల్లేష్ (28) అనే వ్యక్తి తేనె కోసం కడెం మండలంలోని చిట్యాల్ అటవీ ప్రాంతంలోకి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈనెల 25న రాత్రి వెళ్లారు.
ఈ క్రమంలో రాత్రి సమయంలో తేనె తీయడానికి 30మీటర్ల ఎత్తుగల తుమ్మ చెట్టుపైకి ఎక్కిన కుర్ర మల్లేష్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి చనిపోయారని మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.