కడప – కడప నగరంలో మూడో రోజు టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడు చివరి రోజైన ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికల్లో విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడుకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 5 లక్షల మంది రాష్ట్రం నలుమూలల నుంచి ఈ వేడుకకు తరలివచ్చారని అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు వచ్చేలా పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక చివరి రోజైన మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగనుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్తు లక్ష్యాలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, మూడు రో్జుల పాటు జరిగిన మహానాడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనాలు తరలివచ్చారు.. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇక మూడో రోజు ఏకంగా అయిదులక్షల మందికి పైగా హాజరయ్యారు.. ఇక . ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గత 4-5 రోజుల నుంచి కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది.
మహానాడు తొలి రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు ప్రతినిధుల సభతోపాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చించారు. ఇదే రోజున చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. చివరి రోజైన నేడు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల జరిగే అభివృద్ధి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను నేతలు ప్రజలకు వివరించారు. ఇక మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..