- సాత్విక్ -చిరాగ్ జంట ఔట్
మకావ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ (Lakshya Sen ), తరుణ్ మన్నేపల్లి (Tharun Mannepalli ) సెమీఫైనల్స్ చేరగా, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ (Satwiksairaj Rankireddy-Chirag Shetty) నిష్క్రమించింది.
🔹 కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్య సేన్ ఈ సంవత్సరంలో తొలిసారి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు. చైనాకు చెందిన జూ షుయాన్ చెన్ను 21-14, 18-21, 21-14 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు సాగింది.
🔹 తరుణ్ మన్నేపల్లి కూడా అద్భుత ప్రదర్శనతో తన తొలి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. చైనా ఆటగాడు హూ జె అన్నపై 21-12, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఈ పోరు ఒక గంట 15 నిమిషాల పాటు జరిగింది.

➡️ సెమీఫైనల్స్లో లక్ష్య సేన్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ను, తరుణ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోను ఎదుర్కొనబోతున్నారు.
🔻 మరోవైపు, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. మలేషియా జంట చూం హాన్ జియాన్ – ముహమ్మద్ హైకల్ చేతిలో 14-21, 21-13, 22-20 తేడాతో ఓటమి చవిచూశారు.