హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న 25 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం ఒక తెరిచిన పుస్త‌కం లాంటింది.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీల‌క నేత‌, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హ‌రీశ్‌రావు (T Harish Rao) అన్నారు. లండ‌న్ నుంచి తిరిగివ‌చ్చిన ఆయ‌న మాట్లాడారు. ​గత కొంతకాలంగా త‌మ‌ పార్టీపైన, త‌న‌పైన కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

‘​కేసీఆర్ (KCR) నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో తాను చూపిన నిబద్ధత, త‌న‌ పాత్ర అందరికీ తెలిసిందే ‘ ​​కేసీఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.


​ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల‌ను ఆదుకోవడం త‌మ‌ కర్తవ్యంమ‌ని, ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే త‌మ‌ దృష్టి అంతా ఉంటుందని హ‌రీశ్‌రావు (Harish Rao) అన్నారు. ​కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామ‌న్నారు.

Leave a Reply