పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారి విశ్వాసాన్ని పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఆయన పెద్దపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. శాంతి, భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.
విజిబుల్ పోలీసింగ్ పెంచాలనీ, ప్రజలతో సానిహిత్యం ఏర్పరచుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మహిళల భద్రతకు ‘షీ టీమ్లు’ సేవలందిస్తున్నాయని తెలిపారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ తనిఖీలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు.