ఖమ్మం, ఆంధ్రప్రభ : విద్యుత్ (Power Sector) సిబ్బంది పడిన శ్రమను తాను కళ్లారా చూశానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(dy cm bhatti vikramarka) అన్నారు. బుధవారం ఖమ్మంలో ఎలక్ట్రికల్ అంబులెన్స్లను (ambulance ) ఆయన, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో (khammam ) వరదలు (Floods ) వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అప్పుడే వారి శ్రమను తాను కళ్లారా చేశానని పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటిల బీమా
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.కోటి బీమా చేయించామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు. ముందుచూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం ఏ పరిశ్రమను నెలకొల్పిన దాఖలాలు లేవని, తాము అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లతో పంప్డ్ స్టోరేజీ, సోలార్ ప్రాజెక్టులన ఏర్పాటు చేశామని అన్నారు.